NalgondaTelangana

ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌??.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, మునుగోడు : ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మునుగోడు మెయిన్ సెంటర్ లో బీఆర్ఎస్ నాయకులతో కలసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ఎల్‌ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్… అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.

Read Also : ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మ్యానిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారెంటీలను ఇచ్చారని, కానీ బీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ చేయాలని అయన డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడినరు అని ఆయన అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు‌, పార్టీ అన్ని విభాగాల నాయకులు, ఎల్ఆర్ఎస్ బాధితులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్‌బై
  2. లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ భేటీ
  3. పార్కుల్లో అనైతిక పనులు.. ఆరు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. హీటెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??
  5. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు.. BRS నుంచి వచ్చిన ‘ఆ నలుగురికి’ ఫిక్స్??

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.