ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కార్యాలయం లో నంద్యాల పట్టణ కార్య వర్గ సమావేశం పట్టణ ప్రధాన కార్యదర్శి శివ శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ మహిళా విభాగం కన్వీనర్ ప్రసన్న కుమారి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని “దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా ” అనే దేశ భక్తి గీతము తో పట్టణ ప్రధాన కార్యదర్శి శివ శంకర్ కార్య క్రమాన్ని ప్రారంభించి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక యొక్క పరిచయం చేయడం చేశారు. జిల్లా అధ్యక్షులు రహీమ్ ఐక్య వేదిక పనిచేస్తున్న అంశాలు ,భారత రాజ్యాంగ ము కనీస అవగాహన, సమాచార హక్కు చట్టం, గ్రామ సభలు ,లోప భూఇష్ట ఎన్నికల విధానాలపై ప్రజల అవగాహన కల్పిస్తూ,ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ పనిచేస్తున్నదని తెలిపారు. అనంతరం పట్టణ నూతన కమిటీ నీ ఏకగ్రీవంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేశారు. మహిళా విభాగం కన్వీనర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ ఐక్య వేదిక లక్ష్యాల సాధనకు మహిళలను కూడా భాగస్వామ్యం చేస్తూ మహిళా విభాగం లో నంద్యాల పట్టణ మహిళా విభాగ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అని తెలిపారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా సౌజన్య, ప్రధాన కార్యదర్శి రమా దేవి, కోశాధికారిగా నీలిమ సహాయ కార్యదర్శిగా వెంకట రమణమ్మ, నంద్యాల పట్టణ అధ్యక్షులుగా భీష్మ, ప్రధాన కార్యదర్శిగా శివ శంకర్, కోశాధికారి గా ఈక్బాల్, ఉపాధ్యక్షులుగా వాసుదేవ, మదార్ వలి, సహాయ కార్యదర్శిగా మహేశ్వర ఆచారి, రసూల్, సభ్యులుగా కరాటే మహబూబ్ బాషా, ననిరసూల్, హుసేన్ భాషలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐక్య వేదిక యొక్కమహా సభలు పిబ్రవరి 24, 25 వ తేదీ లలో నంద్యాల లో జరుగు రాష్ట్ర మహా సభలు కు సంబందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రహీమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి, జిల్లా కోశాధికారి సత్యనారాయణ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్న కుమారి సభ్యులు రహంతుల్లా, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.
1 minute read