NagarkurnoolTelangana

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి

క్రైమ్ మిర్రర్, నాగర్ కర్నూల్ ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై పసిప్రాణం బలి తీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్న తండ్రే  కన్న కూతుర్ని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని బిజినపల్లి మండలం కిమ్యా తండా గ్రామానికి చెందిన కేతావత్ తిరుపతయ్య, శివలీల అలీయాస్ రాధికకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త తిరుపతయ్య. తరుచు తగాదాల కారణంగా గత మూడు నెలలుగా భర్తకు దూరంగా హైదరాబాద్ లోని మియాపూర్ లోని తన తల్లి వద్దే ఉంటోంది శివలీల.

Read Also : కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు

అయితే భార్యకు సర్దిచెప్పి తీసుకువెళ్దామని తిరుపతయ్య హైదరాబాద్ లోని అత్తారింటికి వెళ్లాడు. అయితే తరచూ జరుగుతున్న గొడవలు, అనుమానం కారణంగా భర్తతో వెళ్లేందుకు శివలీల నిరాకరించింది. ఇదే అంశాన్ని భర్త తిరుపతయ్యకు తేగిసి చెప్పింది. భార్య రావడానికి నిరాకరించడంతో కూతుర్ని తన వెంట ఆటోలో స్వగ్రామానికి తీసుకెళ్తానని నమ్మించాడు. 14 నెలల పాపను వెంటబెట్టుకొని సొంత గ్రామానికి ఆటోలో బయలుదేరాడు. వెళ్తున్న క్రమంలో మరోసారి ఫోన్ చేసి భార్యను బతిమాలాడు. భార్య స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన తిరుపతయ్య హైదరాబాద్ శివారులో మద్యం సేవించాడు. అనంతరం బిజినపల్లి శివారులో నిర్మానుష్య ప్రదేశంలో ఆటోలో ఉన్న కన్నకూతురి గొంతు నులిమి చంపేసాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు తిరుపతయ్యను రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి : 

  1. కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పెద్దపల్లి మాజీ MLA కన్నుమూత
  2. బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు….
  3. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్..!
  4. రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. రంగంలోకి ఈడీ, ఐటీ!!!

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.