క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆదివాసీల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఆదివాసీలు గత కొంతకాల నుంచి కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఇదే అంశంపై విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తరఫున సమ్మక్క సారమ్మకు గురువారం నాడు కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Read Also : తెలంగాణ కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం అభ్యర్ధులు డుమ్మా.. తలలు పట్టుకున్న పోలీస్ శాఖ!!
సమ్మక్క సారమ్మ పండుగను జాతీయ పండగగా గుర్తించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. జాతీయ పండగగా గుర్తించే సిస్థం దేశంలో మరే చోట లేదని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి వివరించారు. జాతర కోసం రూ.3.14 కోట్ల నిధులు అందజేశామని వివరించారు. సమ్మక్క సారమ్మ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గిరిజన వర్సిటీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రధాని మోదీ చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో దోషులను శిక్షించాల్సిందే.. కేటీఆర్ ట్వీట్!
- తాగుడు ఎంత పని చేసింది.. గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత.. వ్యక్తి మృతి
- దోస్త్ మేరా దోస్త్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రశంసల జల్లు.. కారణం ఏంటి..?
- బిగ్బాస్ ఫేం షణ్ముక్ ఇంట్లో గంజాయి.. అన్న కోసం వెళితే అనుకోని విధంగా..!
- రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి రాక..
2 Comments