క్రైమ్ మిర్రర్, యదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికను కొందరు దండగులు కారులో ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. సుమారు 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఓ ఎస్యూవీ కారులో వచ్చిన కొందరు దండగులు చిన్నారిని కారులో ఎక్కంచుకునేందుకు ప్రయత్నించారు. బాలిక గట్టిగా అరవటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికుల అప్రమత్తతో వారు కారులో పరారయ్యారు. కొందరు యువకులు కిడ్నాపర్లను పట్టుకునేందు వారి కారును వెంబడించారు. ఓ వెంచర్లోకి ప్రవేశించిన దండగులు వారికి చిక్కకుండా కారును వేగంగా డ్రైవ్ చేసి చాలా తెలివిగా అక్కడి నుంచి పరారయ్యారు.
Read Also : అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి
చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు గ్రామంలోనూ ఓ ముఠా సంచరించింది. మారుతి స్విఫ్ట్ కారులో వచ్చిన మరో గ్యాంగ్ స్కూల్కు వెళ్లే చిన్నారులను అపహరించేందుకు ట్రై చేసినట్లు తెలిసింది. స్థానికుల అప్రమత్తతో వారు కూడా పరారు కాగా.. ఓ దండుగుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. వారం రోజుల క్రితం గ్రామంలో మేకల్ని కూడా అపహరించుకెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు దుండగులు వారిని కిడ్నాప్ చేసి వేరే రాష్ట్రాలకు తరలించటం లేదా వారిని యాచకవృత్తిలోకి దించటం వంటివి చేస్తున్నారని చెబుతున్నారు. ఒంటరిగా పిల్లల్ని విడిచిపెట్టకూడదని.. వారని ఓ కంట కనిపెడుతుండాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ సహా మరో ఇద్దరికి భారతరత్న..
- రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్కు పెద్ద కష్టమే!!!
- దద్దరిల్లిన అసెంబ్లీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ