క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ తో బిజేపి పొత్తు అంటే చెప్పుతో కోటండంటు బీజెపి శ్రేణులకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డారని తెలిసిన కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని, బీజేపికి రాముడున్నాడు, మోదీ ఉన్నాడు. కాంగ్రెస్, బీజేపి వైపు రాక్షసులున్నారని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన మోదీకి 370 ఎంపి సీట్లను బహుమతిగా ఇద్దామని అన్నారు. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని, హిందూత్వం మాట్లాడలేని నాడు రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నా కేసీఆర్ టూర్!!
- టీ కాంగ్రెస్లో కారు చిచ్చు.. మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు!!!
- మేడారం జాతర ఎఫెక్ట్… సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం
- ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం.. సోనియా, ఖర్గేలకు కవిత లేఖ..
- ‘సార్ మమ్మల్ని ఆదుకోండి..’ సీఎం రేవంత్కు 2008 డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్ధన..
One Comment