NationalTelangana

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ సందర్బంగా ఈడీ 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని.. మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను..  కీలక అంశాలపై ఆరా అధికారులు ఆరా తీశారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.వందకోట్ల ముడుపులపై  ఈడీ ఆరాతీసింది. ఈ వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Also Read : తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పట్టాలెక్కనున్న డోర్నకల్‌-గద్వాల రైలు మార్గం ప్రాజెక్టు!!!

అయితే, కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటీషన్ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆర్టర్ ను రిజర్వ్ చేసింది. అనంతరం ధర్మాసనం కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు.. 14 రోజులపాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. కవితని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నామని.. కొందరితో ఎదురు బొదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది. వైద్య పరీక్షల నివేదికలు కవితకు అందజేయాలని కోరిన కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కవిత బెయిల్ పిటిషన్ మీద రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు.

Read Also : హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!

వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం, కవిత అభ్యర్థనపై ఆర్డర్ రిజర్వ్ చేశారు.. జడ్జి కావేరి బవేజ.. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ మీద సైతం తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది. కోర్టుకు హాజరవుతున్న క్రమంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ పేర్కొన్నారు. తాను క్లీన్ గా బయటకు వస్తానని.. అప్రూవర్ గా మారనని పేర్కొన్నారు. ‘‘ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు.. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.. మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.. నేను క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు’’.. అంటూ కవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?
  2. కోమటిరెడ్డి బ్రదర్స్ కూల్ కాలేదా.. అద్దంకి పదవి రానట్టేనా?
  3. వడ్డీ చెల్లించలేదని..నడ్డి విరిచాడు…చంపేస్తానంటూ తన స్టైల్ లో వార్నింగ్..?
  4. మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్
  5. చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందంటూ వివాహిత ఆత్మహత్య..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.