Telangana

హీటెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో రోజురోజుకు లోక్‌సభ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ముందుకెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఇక మోదీ చరిష్మాతో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ బీజేపీ కూడా.. విజయ సంకల్ప్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ.. నేడో రేపో తొలిజాబితాకు సిద్ధమైంది. అయితే.. బీఆర్‌ఎస్‌ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత దూకుడు.. పార్లమెంట్‌ పోరులో చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా పట్టునిలుపుకుని సత్తా చాటేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘సారు కారు 16’ పేరుతో ప్రజల్లోకి వెళ్లినా.. అది కూడా.. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించినా.. 9 సీట్లు మాత్రమే గెలుపొందారు.

Read Also : వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!

గత లోక్‌సభ ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి, వ్యాపారవేత్తలకు, పారాషూట్‌ లీడర్లకు టికెట్లు కేటాయించిన పార్టీ.. ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది బీఆర్‌ఎస్‌. సామాజిక సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకొని టికెట్లు కేటాయిస్తోంది.గతంలో ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో.. రెండు పార్టీలతోనూ పోటాపోటీగా భారత రాష్ట్ర సమితి పోరాడాల్సి ఉంది. దీంతో.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. ఆ సమాచారంతో అభ్యర్థుల వారిగా సర్వేలు కూడా నిర్వహిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్లను అవకాశం కల్పించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి 2 ఎంపీ ఎన్నికల కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

Also Read : సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు.. ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

ఈ లోపు పార్లమెంటు ఎన్నికల్లో ఎజెండాగా నీటి పోరు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ఆందోళన చేయాలని ఆలోచిస్తుంది. మరోవైపు.. లోక్ సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సై అంటోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను.. 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పటికే టికెట్లపై కసరత్తు పూర్తి చేసింది. అంతేకాకుండా.. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తోంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించేశారు. సీఎం తన సొంత గడ్డ పైనుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఊపు కనిపిస్తోంది. ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక.. బీజేపీ కూడా దూకుడు పెంచింది.

Read Also : నేడు జనం నుంచి వనంలోకి వనదేవతలు.. మూడోరోజు బారులు తీరిన భక్తజనం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90 శాతం ఓట్లు సాధించి 8 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది. అదే ఊపుతో మరిన్ని లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటుంది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ 10 లోక్‌ సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎంపీలనే కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపించింది. శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ జరిగిన రెండ్రోజుల్లో తొలి జాబితా రిలీజ్‌ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మొత్తానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఫుల్‌ ఫోకస్‌ పెట్టడంతో.. తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

ఇవి కూడా చదవండి : 

  1. భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. నేడు సీఎం సుదీర్ఘ సమీక్ష
  2. ఐఏఎస్‌ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్‌ఫర్.. ఈసారి ఏ శాఖకంటే..?
  3. ఢిల్లీ లిక్కర్ స్కాంలో షాకింగ్ ట్విస్ట్.. నిందితురాలిగా కవిత పేరు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..!?
  4. మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష.. సీఎం రేవంత్‌రెడ్డి
  5. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు.. BRS నుంచి వచ్చిన ‘ఆ నలుగురికి’ ఫిక్స్??

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.