క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : వైద్యం కోసం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఇక మీరు పప్పులో కలిసినట్లే. అంత దూరం వెల్లి ఆయాస పడవలసిందే అంటున్నారు స్థానికులు. మర్రిగూడ మండలంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం డాక్టర్ ల దోషం పట్టింది. ఒక్క డాక్టర్ కూడా లేని బోసిపోయిన ఆసుపత్రి ఆవరన నేడు కనపడుతుంది. వైద్యం కోసం వెళ్లిన వ్యక్తులు, డాక్టర్లు లేక తిరుగు ముఖం పడుతున్నారు. ప్రభుత్వం డిప్యూటేషన్ ప్రక్రియను రద్దు చేస్తూ, ఉత్తర్వులు ఇవ్వటంతో హుటాహుటిన ఇక్కడ పనిచేసే డాక్టర్ లు తమతమ స్థానాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఒక్క వైద్యుడు కూడా లేకపోవటం అర్చర్యం.
Read Also : త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు.. గవర్నర్ ప్రసంగంలో తమిళిసై వెల్లడి
ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు తమ స్థానాలలో రిపోర్ట్ చెయ్యాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ ఇవ్వటంతో, మర్రిగూడ లో పని చేస్తున్న వైద్యులు తమ పోస్టింగ్ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లిపోయారు. మండల ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రి కి వెళ్లడంతో అసలు విషయం తెలుసుకొని, వేరే ఆసుపత్రులకు బయలుదేరారు. పేరుకే పెద్ద ఆసుపత్రి అన్న బాపతికి, ఎప్పుడు చూడు ఈ ఆసుపత్రికి ఏదో సమస్య వస్తూనే ఉందంటున్నారు స్థానికులు. ఈ రోజు మాదిరిగానే ప్రతి రోజు జరిగితే ఇక ముప్పై పడకల ఆసుపత్రిని మూసివెయ్యక తప్పదని అనుకుంటున్నారు. పాత బిల్డింగ్ లో కేవలం ఒక డెంటల్ డాక్టర్ మాత్రమే ఉన్నారని సమాచారం. ఎమర్జెన్సీ కేసు వస్తే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు మండల ప్రజలు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని, ఈ సమస్యపై స్పందించి వైద్యానికి కొరత రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
- మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేసులో హేమాహేమీలు.. అధిష్ఠానం చూపు అతనివైపేనా..?
- గృహజ్యోతి ఫ్రీ కరెంట్ అర్హుల ఎంపికపై కసరత్తు.. రేషన్ కార్డు ఉంటనే పథకం ?
- తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
One Comment