క్రైమ్

కదులుతున్న రైలు బాత్రూంలో అత్యాచారయత్నం!

హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో అత్యాచారయత్నం ఘటన మరవకముందే రైలులో మరో దారుణ ఘటన జరిగింది.
రైల్లో ఓ బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరించారు ఓ కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు.

ఈనెల 2న ఒడిస్సాకు చెందిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్లో వెళ్తుండగా.. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళిన మైనర్ బాలికను బంధించి లైంగికంగా వేధించాడు కామాంధుడు. అనంతరం సెల్‌ఫోస్‌లో వీడియో చిత్రీకరించాడు. ఆ తర్వాత వదిలిపెట్టడంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది మైనర్ బాలిక.సదరు నిందితుడిని పట్టుకొని పరిశీలించగా వీడియోలు బయటపడ్డాయి.


Also Read : రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు 


దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి విషయం చెప్పింది బాధిత మైనర్ బాలిక. గురువారం ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు మైనర్ బాలిక తండ్రి. ఈ ఘటన కెల్జార్ స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తండ్రి ఫిర్యాదుతో ఫోక్సోతో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Back to top button