క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని హైకోర్టు ఆదేశించింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్కు లేదని హైకోర్టు పేర్కొంది.
Also Read : మేడారం హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్ని రూ. కోట్లు తెలుసా..?
కేబినెట్కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని.. ఈ క్రమంలోనే కోదండరామ్, అలీఖాన్ల నియామకాన్ని కొట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. ఈ ఇద్దరి పేర్లను ఆమోదించాలని గవర్నర్ తమిళి సైకు పంపారు. గవర్నర్ మత్రం ఈ ఇద్దరి పేర్లను తిరస్కరించారు.. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు అర్హతలు లేవన్నారు. దీంతో నియామక ప్రక్రియ అక్కడే నిలిచిపోగా.. ఇంతలో గతేడాది ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే తమ పేర్లను గవర్నర్ ఎమ్మెల్సీలుగా ఆమోదించకపోవడాన్ని దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్.. నేడు భూమి పూజ నిర్వహించనున్న సీఎం రేవంత్
- రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!
- నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..
- ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పునర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి