క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : సమాజంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాలలో మహిళలు ముందుండి మహిళా సాధికారత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని పిలుపునిచ్చారు. గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ వెంకటాపూర్ మండల శాఖ అధ్యక్షులు లకావత్ శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని హాజరై మాట్లాడారు.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో కూడా పోటీపడి విజయం సాధించాలని, మహిళా సాధికారత సాధించాలని, ఒక తల్లిగా, కూతురిగా, భార్యగా, సామాజిక సేవకురాలుగా అనేక రకాల పాత్రలు పోషిస్తున్న మహిళలు అభినందనీయులని పేర్కొన్నారు. భారతదేశంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని దానిని నిలబెట్టేలా ప్రతి మహిళ కృషి చేయాలని కోరారు.
Read Also : సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..!
అనంతరం స్థానిక మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇల్లు మరియు సమాజ నిర్మాణ క్రియలో మహిళ పాత్ర కీలకం గా ఉన్నదని తెలిపారు. అనంతరం జిల్లా డిసిఇబి కార్యదర్శి ఎన్నెం విజయమ్మ మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ, సామాజిక సేవా రంగాల్లో మహిళల యొక్క స్థానం ఉన్నతంగా ఉందని, దీని పటిష్టత కోసం మహిళలందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. అనంతరం ఎస్టీయూ వెంకటాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా 30 మంది మహిళ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు శిరుప సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, మండల శాఖ ప్రధాన కార్యదర్శి గజ్వేల్ విష్ణుమూర్తి, సంఘ బాధ్యులు బిల్లా స్రవంత్, డేగల రమేష్, లవనిక, చెవుల మహేష్, మహిళా ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మార్చి15 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రేవంత్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ…
- హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్.. నేడు భూమి పూజ నిర్వహించనున్న సీఎం రేవంత్
- మేడారం హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్ని రూ. కోట్లు తెలుసా..?