క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : ఆసియాలో అతి పెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న వెళ్ళనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఈ నెల 24 వరకు కొనసాగుతోంది. రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్టాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు వస్తున్నందున అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి :
- నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక..
- భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
- హారన్ కొట్టినందుకు.. ఆర్టీసీ డ్రైవర్ను చితకబాదిన ప్రయాణికులు
- మోడీని ఇక్కడ తిడతారు.. అక్కడ కాళ్లు పట్టుకుంటారు.. బీఆర్ఎస్పై కోమటిరెడ్డి ఫైర్
- 18 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విముక్తి.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు