Telangana

రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేస్తుండగా.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. ఈ నెల 11వ తేదీన ఈ పథకం ప్రారంభ కానుంది. అయితే.. ఈ పథకం కింద ఎవరెవరు అర్హులు.. ఏ ప్రమాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇందిరమ్మ ఇళ్లపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Also Read : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..

ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా.. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తున్నట్లు వివరించారు. కనీసం 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అయితే.. ప్రజా పాలన దరఖాస్తులు, రేషన్ కార్డులు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు సర్కార్ వెల్లడించింది. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌??.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  2. ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
  3. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్‌బై
  4. ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి
  5. లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ భేటీ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.