
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించి సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావడంతో తన పాలనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఆ సర్వేను చూసి రేవంత్ షాకయ్యారని తెలుస్తోంది.
సీఎం రేవంత్ సర్వేలో ఏకంగా 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా థర్డ్ పార్టీ సర్వే నిర్వహించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే చేయించారు రేవంత్ రెడ్డి. ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన మరియు ప్రజల ఆశయాలపై దృష్టి వంటి అంశాలపై సర్వే చేశారు. అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి.
సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు విమర్శలను ఎదుర్కొంటున్నారు.రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా, హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతు.. వారు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి.. వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే తెలిపింది. దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.