క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నంద్యాల జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు త్రాగునీరందించే శ్రీశైలం జలాశయం.. ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, ప్రభుత్వాలు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరం 215 టీఎంసీలకు గాను.. ఇప్పుడు మిగిలింది 34 టీఎంసీలే పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడం జలాశయంలో నిటి నిల్వలు తగ్గిపోయాయి. కేఆర్ఎంబీ విజ్ఞప్తులను రెండు రాష్ట్రాలు పట్టించుకోలేదు. అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి చేయడమే శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజికి కారణం అంటున్నారు అధికారులు. డెడ్ స్టోరేజీకి చేరువలో శ్రీశైలం జలాశయం చేరుకుంది.
Read Also : అనర్హత వేటు వేయాలంటూ దానం నాగేందర్పై హైకోర్టులో పిటిషన్.. ఎంపీ ఎన్నికల వేళ షాక్ తప్పదా..?
డ్యామ్ లో నిటినిల్వలు తగ్గిపోయాయి. ఇక ఈ ఎండాకాలం సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇందుకు కారణం ఇరు తెలుగు రాష్టాలు పోటాపోటీగా జలవిద్యుదుత్పత్తి చేయడమే. గత వర్షాకాలంలో సీజన్ లో నిండుకుండలా శ్రీశైలం జలాశయం నిండుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల సామర్థ్యానికి గాను..ఇప్పుడు 34 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. తాగు, సాగునీటి అవసరాలున్నప్పుడు మాత్రమే జలవిద్యుత్తును ఉత్పత్తి చేయండి. అనవసరంగా విద్యుదుత్పత్తి వద్దు” అంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ ఎంబీ) చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసి… ఇరు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
Also Read : తెలంగాణలో మరోసారి తెరపైకి జిల్లాల విభజన.. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు..?
ఈ పరిస్థితులను ముందే ఊహించిన కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ పలుమార్లు లేఖలు రాసింది. చివరికి బతిమాలుతూ జలవిద్యుత్తును నిలిపివేయాలని కోరింది. తాగు, సాగు నీటి అవసరాల కోసం మాత్రమే జల విద్యుత్తు ఉత్పత్తి జరగాలి. కానీ, సాగు, తాగునీటి ఆవసరాలకు లేకుండా శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడంతో విలువైన నీరు దిగువకు వెళ్లిపోయింది. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శ్రీశైలం జలాశయంలో గత ఏడాది మార్చి 26 ఇదే సమయానికి 809.60 అడుగులుగా 34.4273 టి.ఎం. సి. జలాశయంలో నీరు ఉంది. అయితే, ప్రస్తుతం ఇవాళ శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తీ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 810. 70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 34.6979 టీఎంసీలుగా నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది.
ఇవి కూడా చదవండి :
- బిజాపూర్లో భీకర ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!!!
- మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ!!
- తెలంగాణ కాంగ్రెస్లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!
- లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి… కేటీఆర్ హాట్ కామెంట్స్
- అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!