
తెలంగాణ కాంగ్రెస్కు నిజంగానే మంచి రోజులు రాబోతున్నాయా…? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అవును అనక తప్పదు.. మీనాక్షి నటరాజన్ రాకతో… పార్టీలో పాత సంప్రదాయలకు బ్రేక్ పడబోతోంది. పార్టీ కోసం కష్టపడే వారికి ఫలితం దక్కబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇదే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పదవుల విషయంలో…మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపించబోతున్నారట.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు… ఎవరు ఇన్ఛార్జ్గా వచ్చినా.. వారి విధేయులకు, భజనపరులకు మాత్రమే అవకాశాలు దక్కేవి. నాయకులకు అనుకూలంగా ఉన్నవారికే పదవులు ఇచ్చుకునేవారు. కానీ… ఇకపై అవన్నీ చెల్లవనేది మీనాక్షి నటరాజన్ మాటల్లో తేలిపోయింది. మాటల్లోనే కాదు.. చేతల్లోనే ఆమె అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. టీపీసీసీ పదవుల నుంచి.. నామినేటెడ్ పదవుల వరకు పార్టీ కోసం కష్టపడేవారికి… ప్రజల్లో ఉండే నాయకులకే ఇవ్వాలని ఆమె డిసైడ్ అయిపోయారట. ఇప్పటికే… పదవుల పంపకాల లిస్ట్ రెడీ అయిపోయినా… దాన్ని పక్కన పెట్టి… కొత్త లిప్ట్ రెడీ చేయబోతున్నారట మీనాక్షి నటరాజన్. దీనిపై ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టేశారట.
దీపా దాస్ మున్షి ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలోనే పీసీసీ పదవులతోపాటు…. 200కుపైగా ఉన్న నామినేటెడ్ పదవులను ఎవరికి ఇవ్వాలో జాబితా రెడీ చేశారట. ఈ లిస్ట్ ముఖ్యమంత్రి వరకు చేరకపోయినా.. మంత్రుల వరకు చేరింది. అధిష్టానం పెద్దల దగ్గర లాబీయింగ్ చేసుకుని…. ఎవరికి వారు.. వారికి కావాల్సిన వారి పేర్లను జాబితాలో చేర్చుకున్నారట. ఈ లిస్ట్కు… సీఎం ఆమోదముద్ర ఒక్కటే పెండింగ్లో ఉంది. అయినా సరే… ఈ లిస్ట్ పక్కన పెట్టి.. పదవులపై మొదటి నుంచి కసరత్తు చేస్తున్నారట మీనాక్షి నటరాజన్. పార్టీకి, ప్రజలకు మేలు చేసే నాయకులకే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ప్రజల కోసం పనిచేస్తూ.. గుర్తింపు లేని నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరికీ తగిన గుర్తింపు రాబోతుంది. ఇదే జరిగితే… కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వచ్చినట్టే. అయితే… మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు సరిగ్గా ఉన్నా… అవి ఎన్ని అమలుకు నోచుకుంటాయో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ.. లాబీయింగ్లు ఎక్కువ. అవన్నీ దాటుకుని…. మీనాక్షి నటరాజన్ మార్క్ కనిపిస్తుందా…? ఆమె అనుకున్న మార్పు సాధ్యమవుతుందా…? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి …
-
గులాబీ గూటికి తీన్మార్ మల్లన్న – ఆ వీడియోల వెనుక అర్థం అదేనా..?
-
సొంత పార్టీ ఏర్పాటా?… పక్క పార్టీలో చేరడమా ?? తీన్మార్ మల్లన్న ముందున్న దారి ఏమిటి???
-
ఏపీ భవిష్యత్ జనసేన – ఈ కాన్సెప్ట్ వెనకున్న స్ట్రాటజీ ఏంటి…?
-
రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ – 15శాతం వృద్ధే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు
-
కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్… స్పందిస్తూ సీఎంపై సెటైర్లు వేసిన కేటీఆర్