క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమౌతుంది. ఈ పర్యటనలో పాల్గొనల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో అన్నీ పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్ట్ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నేల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శాఖ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
Also Read : అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి
ఈ నేల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్ పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13నా చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో వరదల కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్ ఒకటి నుండి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్ కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి డేటా రానుంది.
ఇవి కూడా చదవండి :
- చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం.. కారులో వచ్చి పిల్లల్ని అపహరించేందుకు యత్నం
- బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ సహా మరో ఇద్దరికి భారతరత్న..
- కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి