క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూకట్ పల్లి నియోజకవర్గంలో అల్లాపూర్ డివిజన్ లో పర్యటించారు. శ్రీ వివేకానంద నగర్ లో మేడ్చల్ జిల్లా బీజేపీ నేత పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేందర్ హామీ ఇచ్చారు.
మల్కాజ్ గిరిలో గెలిచి ప్రధాని మోడీకి కానుకగా ఇద్దామని ఈటల రాజేందర్ పిలుపిచ్చారు. కాలనీకి చెందిన పలు సంఘాల నేతలు ఈటలను కలిసి తమ మద్దతు తెలిపారు. అల్లాపూర్ డివిజన్ కు చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరావు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- సుప్రీంకోర్టులో కవితకు షాక్..బెయిల్ మంజూరుకు నిరాకరించిన ధర్మసనం
- మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్
- సీఎం పేరుతో పొంగులేటికి పొగ?
- తెలంగాణ మంత్రుల మధ్య చిచ్చు!