జాతీయం

NTPC updates: 3,445 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

NTPC updates: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2024 సీబీటీ రెండవ దశ పరీక్ష డిసెంబర్ 20వ తేదీన జరగనుంది.

NTPC updates: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2024 సీబీటీ రెండవ దశ పరీక్ష డిసెంబర్ 20వ తేదీన జరగనుంది. సీబీటీ మొదటి దశ ఫలితాలు ఇటీవల ప్రకటించబడగా దాదాపు 51,979 మంది అభ్యర్థులు రెండవ దశకు అర్హత సాధించటం ఈ పరీక్ష ప్రాముఖ్యతను మరింత పెంచింది. మొత్తం 51,979 మంది సీబీటీ రెండవ దశకు ఎంపికవ్వడం ద్వారా రైల్వేలో ఉద్యోగం కోసం పోటీపడుతున్న యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది.

గత ఏడాది రైల్వే శాఖ మొత్తం 3,445 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. వివిధ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలలోకి వచ్చే అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ పోస్టులకు భారీ సంఖ్యలో ఒత్తిడి ఉండటంతో సీబీటీ పరీక్షల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పటి వరకు పరీక్షలు సజావుగా జరగడం, ఫలితాలు విడుదల కావడం, రెండవ దశ షెడ్యూల్ ప్రకటించడం తదితర అంశాలు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంచాయి. రాబోయే పరీక్షలో అభ్యర్థులు మరింత జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి. మరిన్ని వివరాలకు https://www.rrbapply.gov.in/#/auth/landing వెబ్ సైట్‌ను చూడగలరు

ALSO READ: కొత్త చర్చకు దారితీస్తున్న నాయకుల ఆఫర్లు?

Back to top button