క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప): మండల కేంద్రానికి చెందిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి నానమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడిశెట్టి స్వామి తల్లి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని బుధవారం పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పరామర్శించి మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవిచందర్, మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీను, ఎంపీటీసీ జంగిలి రవి, తిరుపతి రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, బూస సాంబయ్య, నల్ల కోటి, జాకీర్, చేరాలు, రాజు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచాలి.. మంత్రి దనసరి అనసూయ సీతక్క
- రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!
- నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..
- ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్ఆర్ఎస్??.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..