తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:-
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం తెల్లవారుజామున 03:00గంటలకు పెట్రోలింగ్ వాహన సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుమారు 03:45 గంటలకు అశోక్ లేలాండ్ టీఎస్ 08 యుఎఫ్ 7771 వాహనం లో (5) పశువులు కనిపించాయని, ఆరా తీయగా.. వాటికి ఎలాంటి అనుమతి లేదని గుర్తించమన్నారు. అట్టి పశువులను జనగాం, నవాబ్ మార్కెట్ నుండి కొనుగోలు చేసి తుక్కుగూడ, హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా నిందితులు తెలిపారన్నారు. పశువులను హైదరాబాద్ లోని జియాగుడ గోషాలకు తరలించమన్నారు. నిందితులు వాహన డ్రైవర్ 1. ఉమర్ (34), పహాడీ షరీఫ్, హైదరాబాద్, 2. ఎండి ముజాయీద్ (45), జె జె నగర్, సూర్యాపేట లకు చెందిన వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు.

విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?

కమలంలో కల్లోలం – దమ్ముంటే సస్పెండ్ చేయండి- రాజాసింగ్‌ వార్నింగ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button