క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా.. మరో రెండు గ్యారంటీల అమలకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ. 500 గ్యాస్ సిలండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితి విద్యత్ పథకాలను అమలు చేయనున్నారు. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఈ సమావేశాల్లోని గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. అయితే.. రేషన్కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ఫ్రీ కరెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గృహజ్యోతి పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలిసింది.
Read Also : మారని విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణి… ఆందోళనలో రైతులు, స్థానికులు
వీటి ఆధారంగానే విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రస్తుతం వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రజా పాలనలో ఫ్రీ కరెంటు కోసం తెలంగాణ వ్యాప్తంగా మెుత్తం 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో 30 శాతం మంది రేషన్కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదని తేలింది. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. అఫ్లికేషన్ పెట్టుకున్న వారిలో 10 లక్షల మందికి అసలు రేషన్కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి ఫస్ట్ ఫేజ్లో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే దానిపై ప్రాథమికంగా లెక్కలు తేలనున్నాయి. ఆ తర్వాత లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి డిస్కంలు సాఫ్ట్వేర్ను రూపొందించాయి.
ఇవి కూడా చదవండి :
- మారని విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణి… ఆందోళనలో రైతులు, స్థానికులు
- ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు!!
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
- మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!
- అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
One Comment