
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: :- యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఏపీ39వై9688 గల వాహనం రెండు కార్లు నెంబర్ టీఎస్10ఈవి9520, టీఎస్05యూసి0854 గల కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో నరెశెట్టి శ్రావణి (29), సికింద్రాబాద్ కు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
మాకు క్యాబినెట్ లో చోటు ఇవ్వండి…!
యాదగిరిగుట్టలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణతరగతులను జయప్రదం చెయ్యండి