
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు బాగా పెరిగిపోతాయని వాతావరణ శాఖ తెలిపిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల సమయంలో ఎవరూ కూడా బయట తిరగవద్దని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయట అనవసరంగా తిరగకండి అని ప్రభుత్వాధికారులు సూచనలు చేశారు.
కూల్ డ్రింక్ మూతలు, పల్లి గింజలకు చిన్నారులు బలి!… తల్లిదండ్రులు జాగ్రత్త?
అంతేకాకుండా ఎండ వేడిమి నుంచి రక్షించుకోవడానికి అధికంగా నీరు తాగండి, పాదరక్షకులు ధరించండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి అంటూ అధికారులు సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ నీరు తాగినప్పటికీ దాహంగా ఉంటే నీటి బదులు ORS తాగడం మంచిదని తెలిపారు. అలాగే ఈ ఎండాకాలం మొత్తం కూడా టీ మరియు కాఫీ లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ప్రోటీన్ ఉండే ఆహారం కూడా తీసుకోవద్దని తెలిపారు.
ఐదులో నాలుగు ఎమ్మెల్సీలు నల్గొండ జిల్లాకే
ఇక రాష్ట్రంలో ఎండ వేడిమి అనేది ఇలా ఉంటే మరోవైపు నీటి ప్రాజెక్టులు మరియు భూగర్భ జలంలో నీరు లేక వ్యవసాయదారులు విలవిల లాడిపోతున్నారు. అన్నదాతలు పండించిన పంటకు చివరి దశలో నీరు లేకపోవడంతో వైరు ఎండిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని… ప్రభుత్వం ఎలాగైనా నష్ట పరిహారం అందించేలా చూడాలని కోరుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.