తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. చెన్నై కస్టమ్స్ అధికారులు అతనికి నోటీసులు ఇచ్చారు. స్మగుల్డ్ గూడ్స్కు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని హర్షాని ఆదేశించారు. అయితే తనకు ఒంట్లో బాగా లేనందున ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్లు ముబిన్ అనే స్మగ్లర్ తెప్పించాడు. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ల లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేశారు. భారత్లో దొరకని ఈ బ్రాండ్లను ముబిన్ నుంచి స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు.
హర్షారెడ్డి కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు కోటి 75 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్ల స్కామ్ విలువ 100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముబిన్, హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇప్పటికే నవీన్ కుమార్ని విచారించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం వంద కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తున్నారు.