మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. పర్వత్ నగర్ నుంచి అల్లాపూర్ వరకు సునీతమ్మ, అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ తో పాటు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, పీసీసీ సభ్యుడు శేరి సతీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఆరు గ్యారెంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అల్లాపూర్ డివిజన్ కార్యాలయం దగ్గర సునీతమ్మను శాలువాతో సన్మానించారు యువ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి దంపతులు. పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నియోజకవర్గ నాయకుడు విఠల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ,ప్రధాన కార్యదర్శి కనకయ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, రవి ముదిరాజ్, రాజారెడ్డి, కనకయ్య గౌడ్, ఆదినారాయణ, కృష్ణ మూర్తి, అనిల్ పాల్గొన్నారు.
Less than a minute