క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మార్చి 27) సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సొంతగడ్డపై తొలి మ్యాచ్ కావడంతో సన్ రైజర్స్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ లవర్స్కు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుండి స్టేడియానికి ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. ‘ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్
- పైన పటారం.. లోన లొటారం.. నిర్లక్ష్యానికి పరాకాష్టలో మిషన్ భగీరథ పనులు!!!
- తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పట్టాలెక్కనున్న డోర్నకల్-గద్వాల రైలు మార్గం ప్రాజెక్టు!!!
- హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!
- బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?