
హైదరాబాద్ లో మరో సైబర్ కేటుగాళ్లు మోసం బయటపడింది. 70 సంవత్సరాల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 40 లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.
-ఫేస్ బుక్ లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్
-తండ్రి తమను వదిలేసి వెళ్ళిపోయాడని…తల్లి టైలర్ అని పరిచయం చేసుకున్న మహిళ
-చాటింగ్ చేసేందకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చిన మహిళ
-ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్ తో మాట్లాడి 10వేలు పంపిన బాధితుడు.
-అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్ లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్ తో చాటింగ్ చేసిన బాధితుడు.
-సదరు మహిళ జబ్బు పడిందని…ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో 10లక్షలు పంపిన వృద్దుడు.
-అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65లక్షలు చెల్లించిన బాధితుడు.
-కొన్ని రోజుల తర్వత మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని…ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్
-తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పగా సరే అన్న బాధితుడు.
-కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేసిన వృద్దుడు.
-తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిన కేబుల్ ఆపరేటర్
-పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని బాధితుడికి సందేశం.
-బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5లక్షలు చెల్లించిన బాధితుడు.
-సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్సై కి లక్ష సమర్పించుకున్న బాధితుడు.
-కొత్త ఎస్సై వచ్చానని…కేసు అవ్వకుండా ఉండాలంటే 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మరో వ్యక్తి
-దీంతో మరో ఏడు లక్షల పంపిన వృద్దుడు.
-ఇలా మొత్తం 38.73లక్షలు సైబర్ కేటుగాళ్లకు సమర్పించుకున్న వృద్దుడు