
ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ కు సాయం చేయకపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ రియాక్ట్ అయ్యారు. ఇరాన్ తో దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ లో ఉన్నందున తటస్థంగా ఉంటున్నట్లు చెప్పారు. రెండు దేశాలతో తమ దేశానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అమెరికా దాడులతో మరింత ఉద్రిక్తత
తాజాగా ఇరాన్ లోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ అణు క్షేత్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడులు చేసింది. అయితే, ఇరాన్ తో మంచి సంబంధాలు కలిగి ఉన్న రష్యా.. ఇరాన్ కు సాయం చేకపోవడంపై అందరూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై పుతిన్ తాజాగా స్పదించారు.
అసలు విషయం చెప్పిన ఫుతిన్
రష్యా- ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ ఉన్నారని ఫుతిన్ వెల్లడించారు. తాను ఇరాన్ కు మద్దతుగా దాడులు చేస్తే, అక్కడ ఉన్న తమ ప్రజలకు హాని కలిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ యుద్ధం విషయంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. రష్యాకు చెందిన సుమారు 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్ లో నివసిస్తున్నట్లు వివరించారు. తమ దృష్టిలో ఇజ్రాయెల్ రష్యన్ మాట్లాడే దేశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఈ యుద్ధం విషయంలో ఇరాన్ కు సాయం చేయలేకపోతున్నట్లు వెల్లడించారు.
Read Also: మోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ ఫోన్.. ప్రధాని తీవ్ర ఆందోళన!