
క్రైమ్ మిర్రర్, స్పోర్స్ డెస్క్ : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 211 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు కకావికలైంది. ఎక్కువ పరుగులు రాబట్టాల్సిన పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించింది. తొలి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది.
ఐపీఎల్ పవర్ ప్లేలో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 2009లో కేప్టౌన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును హైదరాబాద్ భర్తీ చేసింది.
ఆ తర్వాతి మూడు స్థానాల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 2011లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 15/2, 2015లో డీసీతో జరిగిన మ్యాచ్లో 16/1, 2019లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 16/1 స్కోరు చెన్నై సాధించింది.
ఇవి కూడా చదవండి ..
- ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. యువకుడు మృతి
- ఢిల్లీకి సీఎం కేసీఆర్.. మేటర్ సీరియస్సేనా?
- చికెన్ వండని భార్య.. భర్త సూసైడ్!
- గ్యాంగ్ రేప్ చేసి మర్డర్! వికారాబాద్ బాలిక కేసులో సంచలనాలు..
- గ్యాంగ్ స్టర్ నయీం బినామీలెవరు?
One Comment