TelanganaYadadri Bhuvanagiri

ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆర్‌అండ్‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో దోపిడీ చేశారన్నారు.. యాదాద్రి నిర్మాణం, కొత్త కలెక్టరేట్ల పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఎవ్వర్నీ వదిలేది లేదని.. యాదాద్రి నిర్మాణంలో జరిగిన అవినీతిపైనా విచారణ జరిపిస్తామని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహ్మా స్వామిని దర్శించుకున్న కోమటిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగటం డౌటేనని అన్నాడు.

Also Read : లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ భేటీ

హరీష్ బీజేపీలోకి వెళ్తాడని.. ఇప్పటికే ఆ పార్టీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. గత పదేళ్లల్లో తెలంగాణను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల అప్పులు చేసి ప్రజల నెత్తిన రుద్దుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను 100 ఏండ్లు వెనక్కి నెట్టి విధ్వంసం సృష్టించారని ఫైరయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా కొడుకు కేటీఆర్‌ను తీసుకొస్తే.. అల్లుడు హరీష్ పార్టీ నుంచి బయటకు వెళ్తాడని జోస్యం చెప్పారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఎదురుకునే శక్తి లేక అసెంబ్లీకి రావటం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీలాగా.. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే.. గులాబీ పార్టీకి మిగిలేది నలుగురు మాత్రమేనని అన్నారు.

Read Also : రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ.. ఓ రాజకీయ నేత కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!!

ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే కలిసి విజ్ఞాన పత్రం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ జేబులోంచి ఇవ్వడం లేదు అది ప్రజల సొమ్మేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామేమోననే భయం కేసీఆర్‌కు పట్టుకుందని కోమటిరెడ్డి విమర్శించారు. అందుకే దిక్కులేక బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని దుయ్యపట్టారు. ఎల్‌ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనపై కోమటిరెడ్డి స్పందించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఇంకా గైడ్‌లైన్స్ పూర్తి కాలేదని.. పూర్తి కాగానే అమలు చేస్తామని చెప్పారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. రూ.500లకే సిలిండర్‌ పథకం.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే!
  2. పార్కుల్లో అనైతిక పనులు.. ఆరు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  3. హీటెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??
  4. నాగార్జునసాగర్‌ దగ్గర కనిపించిన అరుదైన దృశ్యం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
  5. వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.