
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లో కలకలం రేపిన బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఏపీ సీనియర్ నేత, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్పై పోలీసు కేసు నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్కు చెందిన ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు టీజీ సోదరుడి కుమారుడు రాయలసీమ రౌడీలతో రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తక్షణమే స్పందించిన పోలీసులు 60 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను సిద్ధం చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో టీజీ వెంకటేశ్ను ఏ5 నిందితుడిగా చేర్చారు.
ఎంపీ టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్, సుభాష్ పులిశెట్టి, మిథున్, వీవీఎస్ శర్మ సహా 80 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు కీలక విషయాలను పొందుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు వివరాల ప్రకారం.. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్ స్థలంలో 80 మంది నిందితులు అక్రమంగా ప్రవేశించారు. జేసీబీలు, హాకీ స్టిక్లతో చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్లోని ఆ సంస్థ ప్రాపర్టీని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారు. పీపుల్ టెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే దాడి చేశారని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. 2021 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో దాడులకు యత్నించారు.
ఇక తనపై నమోదైన కేసుపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బంజారా హిల్స్ భూ వివాదంతో నాకు సంబంధం లేదు.. పోలీసులు బెదిరిస్తే నిందితులు నా పేరు చెప్పి ఉండొచ్చు. ఇది కావాలని నాపై చేసిన ఆరోపణ మాత్రమే. ఎఫ్ఐఆర్లో లేని నా పేరు రిమాండ్ రిపోర్ట్లోకి ఎలా వచ్చింది అని టీజీ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి ..
- ఉపరాష్ట్రపతిగా ఆరీఫ్ఖాన్! మోడీ మైనార్టీ కార్డ్!
- రోజుకు లక్షల కేసుల బీర్లు… వామ్మో తాగుడే తాగుడు!
- దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా..?
- భువనగిరి పరువు హత్య.. 10 లక్షల సుపారీ
- ఏజేన్సీల్లో మావోల అలజడి
One Comment