క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. గురువారం మండలంలోని రామప్ప దేవాలయంలో ఈనెల శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అన్నారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు హన్మకొండ, ములుగు, పరకాల కేంద్రాల నుండి రామప్ప దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందంటూ వివాహిత ఆత్మహత్య..
- ఆ జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేక్… ఎందుకో తెలుసా?
- సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..!
- మార్చి15 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రేవంత్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ…