క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. నేటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణలో కమలదళం దూకుడు పెంచింది. 17 లోక్ సభ సీట్లపై గురి పెట్టింది. హైదరాబాద్లో ఎంఎంఐను ఓడించాలే వ్యూహాలను పదను పెడుతోంది టీబీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్నా సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా పెరగడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సత్తా చాటేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఐదు యాత్రాలతో యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఫస్ట్ వరకు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలకు రంగం సిద్దమైంది.
Read Also : సొంతిళ్లు లేని పేదలకు గుడ్న్యూస్.. నియోజకవర్గానికి 3,500ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు
కేంద్రంలో 400 ప్లస్ పక్కా..తెలంగాణ గతంలో కన్నా ఎక్కువ గెలుస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం 4,238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎంపీ డా.కె. లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు, డీకే అరుణ, ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొననున్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. కాగా, బస్సు యాత్రల సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించే కార్నర్ మీటింగ్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ బీజేపీ నేతలు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి :
- అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్కు పెద్ద కష్టమే!!!
- కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి
One Comment