క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది..పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని నేటి రాత్రి 10.30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు..అనంతరం మహాపూజతో అర్థరాత్రి 12 గంటలకు నాగోబా తొలిదర్శనం ఇవ్వనుంది..ఈ నెల12న గిరిజన మహా దర్బార్ నిర్వహిస్తారు.రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది.
Read Also : రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్కు పెద్ద కష్టమే!!!
ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు..ఆలయం దగ్గర బారికేడ్లు పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయగా..నాగోబా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి, కోనేరును శుభ్రపరిచారు.. జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు..మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు RTC బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో కీలక నిర్ణయాలు..!!
- నిర్మల్ జిల్లాలో దారుణం..ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
- కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి
- వైద్యులు లేని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి….
- త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు.. గవర్నర్ ప్రసంగంలో తమిళిసై వెల్లడి
One Comment