క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు!!
- తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు… ఎందుకో తెలుసా..??
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
- మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!
- అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
3 Comments