Telangana

ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం.. సోనియా, ఖర్గేలకు కవిత లేఖ..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాశారు.

Read Also : నేటి నుంచి లక్నవరం సందర్శన బంద్..

ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని తెలిపారు.

Also Read : చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్‌.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై

రోస్టర్ పాయింట్లు రద్దు చేయడం వల్ల 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనకు భంగం కలుగుతుందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలపై పెట్టే దృష్టి రోస్టర్ పాయింట్లపై పెట్టి ఉంటే ఈ రోజు ఆడబిడ్డలకు అన్యాయం జరిగేది కాదని అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. జీవో 3ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో సోనియా గాంధీ చెప్పాలన్నారు. జీవోను వెనక్కి తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి కవిత విజ్ఞప్తి చేశారు.

 ఇవి కూడా చదవండి :
  1. సార్ మమ్మల్ని ఆదుకోండి..’ సీఎం రేవంత్‌కు 2008 డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్ధన..
  2. నిరాశ్రయులకు నీడనిస్తున్న పగడాల కనకయ్య ఫౌండేషన్…
  3. గైడ్‌గా ‘మై మేడారం యాప్‌’… యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, కలెక్టర్‌
  4. బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్.. ఈసారి ఎమ్మెల్యే.. ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచే లీకులు..!!!
  5. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.