క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో సహా.. ఢిల్లీలోని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత.. ఆయన సమక్షంలో కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా.. తాను పార్టీ మారటానికి గల కారణాలపై వెంకటేష్ నేత తాజాగా క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరగటం తనను బాధించిందని అన్నారు. ఐదేళ్లలో ధాన్యం సేకరణ, కృష్ణా జలాల పంపిణీ అంశం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు వంటి అంశాలపై తాను పార్లమెంట్లో గళం విప్పానన్నారు.
Read Also : తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు… ఎందుకో తెలుసా..??
పార్లమెంట్ ఆవరణలో కీలక అంశాల పరిష్కారం చేయాలని ధర్నా చేశామని గుర్తు చేశారు. ఇంత చేసినా.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అందువల్లే తాను గులాబీ పార్టీకి గుడ్బై చెప్పాల్సి వచ్చిందని అన్నారు. భారతదేశాన్ని ముక్కలుగా విభజించాలని చూస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను ఆకర్షించిందని వ్యాఖ్యనించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాలన బాగుందని ఆయన కితాబు ఇచ్చారు. 2018లో తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. మళ్లీ సొంత గూటికి రావటం ఆనందంగా ఉందన్నారు.
Also Read : మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
ఇక తన ఎంపీ పదవికి కూడా వెంకటేష్ నేత రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్కు పంపించారు. గ్రూప్-1 అధికారి అయిన వెంకటేష్ నేత మరో 18 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మరుసటి ఏడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. తాజాగా మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు మందు సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాగా, ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నిరాకరించటంతోనే పార్టీ మారినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- విజయ్ బాటలో విశాల్.. తమిళనాడులో పుట్టుకొస్తున్న కొత్త రాజకీయ పార్టీలు!!
- మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!
- అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- అద్దెకు ఉండేవారికీ ‘గృహజ్యోతి’ వర్తింపు.. ఫ్రీ కరెంట్పై TSSPDCL క్లారిటీ
- తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్ష నేత పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!
One Comment