క్రైమ్ మిర్రర్, గచ్చిబౌలి : అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని చిట్టీలు కట్టించుకుని, సకాలంలో చెల్లించని చిట్ ఫండ్ కంపెనీలపై చర్యలు తప్పవని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సమతమూర్తి చిట్ ఫండ్ కంపెనీ జనాలకు కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టిన నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమతమూర్తి చిట్ ఫండ్ మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.శ్రీనివాస్, రాకేష్, గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి సమత మూర్తి అనే పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీ ఓపెన్ చేశారని, వీరంతా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇలా ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు.
Read Also : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
సమతమూర్తి చిట్ ఫండ్ కంపెనీలో మొత్తం 120 మంది బాధితులు ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. బాధితుల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేశారని, బాధితులు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సమతమూర్తి చిట్ ఫండ్ కంపెనీకి నగరంలో మూడు బ్రాంచ్లు ఉన్నాయని వీటిలో చిట్టీలు వేసి మోసపోయిన వారు పోలీసులను సంప్రదించాలని, బాధితులకు తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. చిట్ ఫండ్ నిర్వహిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశామని అన్నారు. సమతమూర్తి చిట్ ఫండ్ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో చిట్ ఫండ్స్ పేరుతో మోసాలు పెరుగుతున్నాయని, మాదాపూర్ జోన్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటివే 7 కేసులు నమోదయినట్లు డీసీపీ వెల్లడించారు. ఇలాంటి చిట్ ఫండ్ మోసాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- రామప్ప ఆలయ హుండీ లెక్కింపు.. హుండీ ఆదాయం రూ.7,33,433
- ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు!!
- తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు… ఎందుకో తెలుసా..??
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
- అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు