National

నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జీ 20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో దేశంలో చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉన్న ప్రకటనను విడుదల చేయడం తాజాగా మరో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఏసియన్ ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఏసియా సమ్మిట్‌లకు ప్రధానమంత్రి హాజరు కానున్న వేళ.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలు మరోసారి దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Read Also : ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ.. మార్పు మీ నుంచే మొదలు పెట్టాలంటూ సూచన

ఈనెల 6, 7 వ తేదీల్లో ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 20వ ఏసియన్‌ -ఇండియా సమ్మిట్‌, 18వ ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌లలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ ప్రకటనను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రకటనలో భారత ప్రధానమంత్రిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా పేర్కొనడంతో ఇండియా అనే పేరును భారత్‌గా మార్చుతున్నారనే వార్తలకు మరింత జోరందుకున్నాయి. అయితే ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరుతో విడుదల చేసిన జీ 20 ఆహ్వాన పత్రికలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా భారత ప్రధాని పేరును ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా ప్రచురించడంపైనా మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

Also Read : అలకబూనిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రంగంలోకి ఏఐసీసీ

20 వ ఏసియన్ – ఇండియా సమ్మిట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని తప్పుపట్టిన జైరాం రమేశ్.. ఇది బీజేపీ గందరగోళంలో పడిందని మండిపడ్డారు. ఇది చూస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో అర్థమవుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా అనే పేరును పెట్టుకోవడంతో బీజేపీ నాయకుల్లో భయం నెలకొని.. ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ 20 దేశాధినేతలకు ఇచ్చే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అధికారులు అధికారిక ఆహ్వానాన్ని పంపారు. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేచింది. ఈ క్రమంలోనే ఈనెల 18 నుంచి 22 వరకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వినిపించగా.. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో ప్రకటన విడుదల చేయడం వాటికి బలాన్ని చేకూర్చాయి.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణలో ఎన్నికల హడావుడి.. సిరిసిల్ల నేతన్నకు చేతినిండా పని, లక్షల్లో ఆర్డర్లు
  2. నల్గొండలో విషాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి
  3. భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 50 రకాల వైద్య పరీక్షలు
  4. మూడ్రోజుల క్రితం గల్లంతైన లక్ష్మి.. మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం
  5. ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. అప్రమత్తమైన పోలీసులు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.