
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమ్మ బాబోయ్.. ఈ వార్త వింటే మీరు కూడా అదే మాట అంటారు. అదేంటంటే.. రాజ్యసభ ఎంపీల్లో చాలా మంది బిలియనీర్లే. ఇది అందరికీ తెలిసిన విషయమే అంటారా.. ఆ బిలియనీర్లలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. ఇది కూడా తెలుసంటారా. అయితే.. ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు ఎంపీలుండగా.. ఈ ఏడుగురు ఎంపీల ఆస్తుల విలువ ఆ పదకొండు మంది ఎంపీల ఆస్తుల విలువ కంటే సుమారు డబుల్ ఉన్నట్టుగా రిపోర్టులు చెప్తున్నాయి. ఇదీ అసలు ముచ్చట. అయితే.. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థతో కలిసి 225 మంది రాజ్యసభ ఎంపీలపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో కూడిన రిపోర్టును విడుదల చేయగా.. ఈ విషయం బయటికి వచ్చింది. అయితే.. తెలంగాణ, ఏపీ నుంచి ఈ బిలియనీర్ల లిస్టులో 18 మంది ఎంపీలు ఉన్నారండోయ్. కాగా.. వారి మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.9,419 కోట్లు ఉన్నట్టు రిపోర్టు పేర్కొంది.
Read Also : హైదరాబాద్లో దారుణం… మూగ మహిళపై యువకుడి అత్యాచారం
ఇక.. తెలంగాణ నుంచి ఉన్న ఐడుగురు రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 5 వేల 596 కోట్లు కాగా.. ఏపీ నుంచి ఉన్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ 3 వేల 823 కోట్లుగా ఉంది. దీంతో.. ఏపీ పదకొండు మంది ఎంపీల మొత్తం ఆస్తితో పోలీస్తే దాదాపు డబుల్ అన్నట్టు. రిపోర్టుల ప్రకారం.. రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది ఎంపీలుండగా అందులో ఐదుగురు.. తెలంగాణ నుంచి ఏడుగురిలో ముగ్గురు.. మహారాష్ట్ర నుంచి ఉన్న19 మందిలో ముగ్గురు, దిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు.. పంజాబ్ నుంచి ఉన్న ఏడుగురిలో ఇద్దరు.. హరియాణాకు చెందిన ఐదుగురిలో ఒకరు.. మధ్యప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది ఉంటే అందులో ఇద్దరు ఎంపీల ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే. ఇదిలా ఉంటే.. మొత్తం 225 మంది సభ్యుల్లో 75 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. అందులో 41 మంది రాజ్యసభ సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉంటే.. మరో ఇద్దరు ఎంపీలపై మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు రిపోర్టులు వెల్లడించాయి. మరోవైపు.. నలుగురు ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులు కూడా ఉన్నయంటా. ఈ నలుగులో ఒకరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్పై రేప్ కేసు నమోదైనట్లు నివేదికలో బయటపడింది.
ఇవి కూడా చదవండి :
- గద్దర్ కోట్లు సంపాదించారా?…ఆస్తుల వివరాలు వెల్లడించిన కొడుకు సూర్యం
- రూ.2 లక్షల రుణమాఫీ.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ…టీపీసీసీ రేవంత్ రెడ్డి
- బయటికి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడి ప్రేమ లేఖ.. 40 ఏళ్ల క్రితం ప్రేయసికి రాసిన లేఖ
- హైదరాబాద్లో మరో భారీ భూవేలం.. 300 ప్లాట్లు అమ్మకం.. గజం కేవలం 25 వేలకే..!
- ఇచ్చేది చారెడు…దరఖాస్తులు బారేడు.. గృహలక్ష్మి దరఖాస్తులు నాలుగు రేట్లు అధికం…!!
#
One Comment