Telangana

టీ బీజేపీలో మరింత ముదిరిన వార్.. బండి సంజయ్ టార్గెట్‌గా పోస్ట్‌ల కలకలం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగిస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా మరింత ఊపందుకుంది. ఇటీవల ఈటలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి నడ్డా, అమిత్ షాను కలవడం, ఈ తర్వాత వెంటనే బండి సంజయ్ హస్తిన పర్యటనకు వెళ్లడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని గ్రూపులు ఏర్పడటంతో.. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మరోసారి అప్పగిస్తారనే ప్రచారం బాగా నడుస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్ టార్గెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి సోషల్ మీడియాలో కాషాయ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయారు.

Read Also : అరకోటి విలువైన డైమండ్ రింగ్ మిస్సింగ్.. పోలీసుల ఎంక్వైరిలో టాయిలెట్ బేసిన్‌లో దొరికిన రింగ్

కొంతమంది బండి నాయకత్వానికి మద్దతిస్తూ పోస్ట్‌లు పెడుతుండగా.. మరికొంతమంది ఆయనను వ్యతిరేకిస్తూ పోస్ట్‌ల పరంపర కొనసాగిస్తున్నారు. టీ బీజేపీ కార్యకర్తలు రెండుగా చిలిపోయి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో పోటాపోటీగా పోస్ట్‌లు పెడుతున్నారు. బండి సంజయ్‌ను మారిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని కొంతమంది సెకండ్ స్థాయి నేతలు, కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. మరో వర్గం మాత్రం బండి సంజయ్‌ను మారిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణుల మధ్య జరుగుతున్న వార్ ఆ పార్టీలో కలకలం సృష్టించింది. కార్యకర్తలు స్వచ్చంధంగానే పోస్ట్‌లు పెడుతున్నారా..? లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు కూడా కాషాయదళంలో వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొన్నటివరకు టీ కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు నడిచేది. నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు.

Also Read : ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌!!

కానీ ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీరు ఒక్కసారిగా మారింది. అందరూ ఏకతాటిపైకి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనలతో దూకుడు పెంచారు. జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ 9 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి వెళుతుండగా.. నేతల మధ్య అంతర్గత విబేధాలతో బీజేపీలో దూకుడు తగ్గింది. విబేధాలను పరిష్కరించేందుకు ఇప్పటికే హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత చిచ్చు రగిల్చింది.

ఇవి కూడా చదవండి : 

  1. ఈ గొర్రె పిల్ల చాలా ఖరీదు గురూ.. రూ. కోటి పలికినా విక్రయించని యజమాని
  2. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కేసీఆర్…???
  3. హైదరాబాద్‌లో బయటపడ్డ రూ.40 కోట్ల రీఫండ్ స్కాం.. స్కాం వెనుక ప్రభుత్వ ఉద్యోగులు
  4. 2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ గెలిచాం.. 2023లో ఆ ప్లేయర్ కోసం భారత్ గెలవాలనుకుంటుంది: సెహ్వాగ్
  5. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో తీగల కృష్ణారెడ్డి.. టికెట్ ఇవ్వకపోతే గుడ్ బై అంటూ వ్యాఖ్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.