Telangana

తెలంగాణలో కర్ణాటక ప్లాన్.. జూన్ చివరిలోగా అభ్యర్థులు ఖరారు..!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లోనూ నూతనోత్తేజం నెలకొంది. అక్కడి గెలుపుతో రాష్ట్ర ప్రజల్లోనూ మార్పు వచ్చి కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశముందని టీ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తోన్నారు. దీంతో రాష్ట్రంలో అధికారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహలు బాగా వర్కౌట్ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఆయనే వ్యూహకర్తగా పనిచేస్తోండటంతో.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీ కాంగ్రెస్ క్యాడర్‌లో ఆశలు నెలకొన్నాయి. సునీల్ కనుగోలు తెలంగాణలో తన వ్యూహలకు పదునుపెట్టారు. అతడు ఇచ్చిన సర్వే రిపోర్టుల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీ కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి.

Read Also : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్

జూన్ నెలలోపు దాదాపు 50 శాతం మంది అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించగా.. త్వరలో మరో సర్వే చేయనున్నారు. ఈ సర్వే రిపోర్టులను విశ్లేషించి 60 నియోజకవర్గాలకు జూన్‌లోపు అభ్యర్థులను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. కానీ అభ్యర్థుల పేర్లను బహిరంగంగా మీడియా ముందు ప్రకటించకుండా.. సీటు ఫిక్స్ అయిన అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తక్కువగా ఉన్న నేతలను వేరే నియోజకవర్గాలకు మార్చుతారు. కర్ణాటకలో ఇదే ప్లాన్‌ను కాంగ్రెస్ అమలు చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు టీ కాంగ్రెస్ కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తోంది. సునీల్ కనుగోలు టీమ్‌తో పాటు ఇతర ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను మార్చే అవకాశముంది.

Also Read : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం…

జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత టీ కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలలో ఒకరైనా ప్రతీనెలా రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ప్లాన్ చేస్తోన్నారు. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలను రాష్ట్రానికి తీసుకురానున్నారు. వచ్చే నెల చివరివారంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహలు అమలు చేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో ఈ సారైనా అధికారంలో రావలనే లక్ష్యంతో టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు
  2. హైదరబాద్ లో విషాదం… పెళ్లంటే భయంతో యువతి ఆత్మహత్య
  3. ‘ప్రేమించిన అమ్మాయి కంటే కట్నమే ఎక్కువ’… పెళ్లి పీటలపై నుంచి ప్రేమికుడు పరార్
  4. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ అవార్డు.. బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
  5. కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.