
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : హైదరాబాద్లో రోజుకో కొత్త క్రైం కథ బయటపడుతోంది. మూసీలో మొడెం లేని తల బయటపడిన ఘటన సంచలనం సృష్టించగా.. దాన్ని కాస్త కదిలిస్తే దృశ్యం సినిమాను మించిన క్రైం స్టోరీ బయటపడింది. ఈ ఘటన నుంచి బయటపడకముందే.. రంగారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. చెరువులో ఓ డ్రమ్ము కనిపించింది. చెరువులో డ్రమ్మేంటీ అని దగ్గరికెళ్లి చూస్తే.. అందులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో.. తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూర్యనారాయణ చెరువులో జరిగింది.
Read Also : నాలుగు నెలల్లో వివాహం… కాబోయే భార్యను కాపాడబోయి యువకుడి మృతి…
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం డ్రమ్ములో కుక్కి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి తీసుకు వచ్చి చెరువులో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు డెడ్ బాడీని చెరువులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డ్రమ్ములో దొరికిన మృతదేహం ఆనవాళ్లను ఆధారంగా చేసుకుని.. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు హత్య చేశారు? ఎందుకు హతమార్చారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు చుట్టు పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ‘డిసీజ్ ఎక్స్’… డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన మరో మహమ్మారి ఇదేనా?
- రోజు కూలీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడ్డ రూ.100 కోట్లు.. ఇంతలో షాకిచ్చిన పోలీసులు
- నల్గొండ జిల్లాలో దారుణం… బాలిక ఇంటికి వెళ్లిన బాలుడి దారుణ హత్య
- ‘కొత్త సచివాలయం అద్భుతం.. కానీ..’ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
- ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు.. ఖర్చుల కోసం 105 కోట్లు విడుదల చేసిన కేసీఆర్
One Comment