
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెక్కాడితే గానీ డొక్కాడని ఓ రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతడి బ్యాంకు ఖాతాలో రూ.17 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ, అనూహ్యంగా ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు వచ్చిపడ్డాయి. అంత సొమ్ము తన ఖాతాకు జమ కావడంతో అతడు షాక్లోకి వెళ్లిపోయాడు. అవి ఎలా వచ్చాయో అర్థం కాక అతడు జుట్టుపీక్కుంటున్నాడు. ఇదే సమయంలో వాటికి లెక్క చెప్పాలని పోలీసుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనలకు గురవుతున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. దేగంగాలోని వాసుదేవ్పుర్కు చెందిన మహ్మద్ నసీరుల్లా (26) వ్యవసాయ కూలీ. రోజూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Read Also : నల్గొండ జిల్లాలో దారుణం… బాలిక ఇంటికి వెళ్లిన బాలుడి దారుణ హత్య
అతడికి స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో జీరో అకౌంట్ ఉంది. ఆ ఖాతాలో నగదు నిల్వ కేవలం రూ.17 మాత్రమే. కానీ, ఇటీవల అతడి ఖాతాలో ఒక్కసారిగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. మే 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి అతడికి కంటిమీద కునుకే కరవయ్యింది. ‘పోలీసుల నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు నిద్రపట్టడం లేదు.. నా బ్యాంకు ఖాతాలోకి అంత సొమ్ము ఎలా వచ్చిందో తెలియదు’ అని నసీరుల్లా వాపోయాడు.
Also Read : ‘కొత్త సచివాలయం అద్భుతం.. కానీ..’ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
తొలుత నా బ్యాంకు ఖాతాకు రూ.100 కోట్లు జమైన విషయం తెలియగానే మొదటి నమ్మలేదు.. పలుసార్లు చెక్ చేసుకున్నాను.. వెంటనే పాస్బుక్ తీసుకుని బ్రాంచ్కు పరుగెత్తాను.. అంతకు ముందు నా ఖాతాలో రూ.17 ఉండేదని చెప్పారు.. గూగుల్ పేలో చెక్ చేసుకుంటే రూ.100 కోట్లు చూపించింది.. ఇంత సొమ్ము ఎలా వచ్చిందో నాకు తెలియదు.. నేను ఓ రోజు కూలీ.. పోలీసుల నుంచి నోటీసులు రావడంలో మా ఇంట్లో వాళ్లు ఒకటే ఏడుపు’ అని లబోదిబో మంటున్నాడు. ‘తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసిన బ్యాంకు సిబ్బంది.. పోలీసు కేసు నమోదైనందున తదుపరి సమాచారం అందించలేమని తెలిపారు. ఎవరి డబ్బు అయినా తీసుకోవచ్చు. ఈ డబ్బుతో ఏం చేస్తాను’ అని అన్నాడు. దీనిపై జంగీపూర్ సైబర్ పోలీసులను మీడియా సంప్రదించగా.. స్పందించడానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి :
- కరాటే కళ్యాణిపై ‘మా’ క్రమశిక్షణా చర్యలు… సస్పెన్షన్ వేటు, సభ్యత్వం రద్దు
- ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు.. ఖర్చుల కోసం 105 కోట్లు విడుదల చేసిన కేసీఆర్
- నల్గొండ ఐటీ టవర్ లో 200 ఉద్యోగాలు.. ప్రకటించిన సొనాటా సాఫ్ట్ వేర్
- ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
One Comment