Telangana

ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు.. ఖర్చుల కోసం 105 కోట్లు విడుదల చేసిన కేసీఆర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ధూంధాంగా నిర్వహించాలని కలెక్టర్లను సీఎం కే‌సి‌ఆర్ ఆదేశించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకూడదని తెలిపిన కేసీఆర్.. ఉత్సవాల నిర్వహణ కోసం 105 కోట్లు విడుదల చేశారు. అయితే.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై.. సచివాలయంలో మంత్రులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో.. దశాబ్ది ఉత్సవాలపై ఉన్నతాధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దశాబ్ది వేడుకలు పండుగలా జరపాలని సూచించారు. అరవయ్యేళ్ల పాటు సాగిన పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా అభివృద్ధి చెందినట్టు తెలిపారు.

WhatsApp Image 2023 05 25 at 4.49.19 PM - Crime Mirror

Read Also : నల్గొండ ఐటీ టవర్ లో 200 ఉద్యోగాలు.. ప్రకటించిన సొనాటా సాఫ్ట్ వేర్

అయితే.. రాష్ట్రం అవతరించి పదేళ్లు అవుతున్న సందర్భంగా.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంతో పాటు అమరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కీర్తిని చాటి చెప్పేలా.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరగాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గ్రామల నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.

Also Read : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ అవార్డు.. బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను ధూంధాంగా నిర్వహించి.. విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, సీఎస్, సీఎంవో కార్యదర్శులు, డీజీపీ అంజనీ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి , జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
  2. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
  3. ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
  5. కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.