
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మరో మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ హెచ్చరికలు చేశారు. రాబోయే మహమ్మారి కోవిడ్-19 కంటే ఘోరమైంది కావచ్చిన ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టిన సమయంలో డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు ఇటువంటి హెచ్చరికలు చేయడం గమనార్హం. అయితే, కరోనాను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిధి నుంచి తొలగించినా కోవిడ్ ముప్పు ముగిసిపోలేదని ఆయన హెచ్చరించారు.
Read Also : తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు… 21 రోజుల పాటు వేడుకలు
76వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా నివేదికను సమర్పించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్.. ‘కోవిడ్-19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి ముగింపు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న కరోనాకు ముగింపు కాదు… కొత్తగా వైరస్ వ్యాప్తి, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరో వేరియంట్ ముప్పు ఇంకా మిగిలే ఉంది.. ప్రాణాంతకమైన సంభావ్యతతో ఉద్భవించే మరొక మహమ్మారి ముప్పు కూడా పొంచి ఉంది’ అని స్పష్టం చేశారు. కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి, సంక్షోభాల నేపథ్యంలో ‘మనం ఎదుర్కొంటున్న ఏకైక మహమ్మారి ముప్పు నుంచి చాలా దూరంగా ఉంది’ అని టెడ్రోస్ తెలిపారు. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను పరిష్కరించే, ప్రతిస్పందించే ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాంగాల అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ‘తదుపరి మహమ్మారి తలుపుతడితే మనం నిర్ణయాత్మకంగా, సమిష్టిగా, సమానంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి’ టెడ్రోస్ సలహా ఇచ్చారు.
Also Read : వెరైటీగా వెడ్డింగ్ కార్డు… తెలంగాణ యాసలో ప్రింట్ చేయించిన యువకుడు, సోషలో మీడియాలో వైరల్
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) కింద 2030లోగా చేరుకోవాల్సి ఉన్న ఆరోగ్య సంబంధిత లక్ష్యాలపై కోవిడ్-19 గణనీయమైన ప్రభావం చూపిందని టెడ్రోస్ చెప్పారు. అలాగే, 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమయంలో నిర్దేశించిన మూడు బిలియన్ లక్ష్యాన్ని కూడా మహమ్మారి ప్రభావితం చేసిందన్నారు. ఐదేళ్లలో బిలియన్ మందికి సార్వత్రిక ఆరోగ్య కవరేజీ, మరో బిలియన్ మందికి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుంచి మెరుగైన రక్షణ, మరో బిలియన్ మంది మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సును అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘మహమ్మారి మనల్ని దెబ్బతీసింది,..అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీలు) మన లక్ష్యంగా ఉండాలి.. మహమ్మారిని ఎదుర్కొన్న ఆవశ్యకత, సంకల్పంతో వాటిని ఎందుకు కొనసాగించాలో ఇది మాకు తెలియజేసింది’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఐపీఎల్- 2023 మ్యాచ్ల నిర్వహణ భేష్… రాజకొండ పోలీసులకు సన్ రైజర్స్ బృందం కృతజ్ఞతలు
- కొత్త సెక్రటేరియట్ భద్రతకు ప్రాధాన్యత.. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐలతో నూతన పోలీస్ స్టేషన్
- ఇదేం విచిత్రం.. చిన్నారి కంటి నుంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు!
- రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ వెనుక కుట్ర, ఇదంతా వారికోసమే : మంత్రి జగదీశ్ రెడ్డి
- ‘మా నాన్న తాగొచ్చి.. అమ్మను కొడుతుండు’.. పోలీసులకు చిన్నారి ఫిర్యాదు
One Comment