RangareddyTelangana

దారుణం.. యువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియాలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం క్రికెట్ లవర్స్ కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తారు. తమ అభిమాన జట్లకు మద్దతుగా స్టేడియాలకు పోటెత్తుతారు. క్రికెట్ అభిమానులతో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా ఐపీఎల్ సీజన్ కోసం ఎదురు చూస్తారు. ఐపీఎల్ ప్రతి సీజన్‌లో భారీగా బెట్టింగ్ నడుస్తుంది. బాల్ బాల్‌కు బెట్టింగ్‌ నిర్వహిస్తూ.. వందల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తారు. బెట్టింగ్‌కు పాల్పడి కొందరు ఆస్తులు కోల్పోగా.. మరికొందరు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్‌కి పాల్పడి అప్పులపాలైన యువకుడు వాటిని తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

Read Also : బీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్… కారు గుర్తుతో పోలీవున్న గుర్తుల తొలగింపు

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం నాగూర్లగడ్డ తండాకు చెందిన ప్రకాశ్ ఐపీఎల్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌కు పాల్పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. పందెం డబ్బులు తిరిగివ్వాలని బెట్టింగ్ నిర్వాహకులు ప్రకాశ్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ అప్పు తీర్చే మార్గం కనిపించకపోవటంతో పాటు.. బెట్టింగ్ నిర్వహకుల నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరగటంతో తట్టుకోలేకపోయాడు. ఇక బ్రతకటం కష్టమని భావించి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రకాశ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. యువకుడి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక హైదారాబాద్ ఐపీఎల్ బెట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

Also Read : తిరిగి కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి – రేవంత్ కు షరతు..!?

2023 ఐపీఎల్ సీజన్ మెుదలైనప్పటి నుంచి (మార్చి 31న) ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.4.43 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్ననట్లు పోలీసులు వెల్లడించారు. మెుత్తం 54 మంది బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేయడంతో పాటు వారి దగ్గరి నుంచి 140 సెల్‌ఫోన్లు రికవరీ చేసుకున్నారు. బెట్టింగ్‌కు అలవాటు పడ్డ ఓ హైదరాబాద్ రియల్టర్ రూ. 100 కోట్లు పోగొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. వనస్థలిపురంలో నివాసముండే అశోక్ రెడ్డి అనే వ్యక్తి స్థిరాస్తి వ్యాపారం చేస్తూ భారీగా సంపాదించాడు. అయితే బెట్టింగ్‌ను వ్యసనంగా మార్చుకున్న అశోక్ రెడ్డి గత 12 ఏళ్లలో రూ. 100 కోట్లు పోగొట్టుకున్నాడు. తాను కష్టపడి సంపాదించిందే కాక బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేసి మరీ డబ్బులు నష్టపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : 

  1. ‘4 నెలలుగా అదే మాట’.. సస్పెన్షన్ ఎత్తివేతపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
  2. బావిలో శవాలై తేలిన భార్యాభర్తలు.. అనాథలైన ఏడేళ్లలోపు ఇద్దరు చిన్నారులు
  3. బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైయస్ షర్మిలపై కేసు నమోదు
  4. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం… నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
  5. ‘నాన్న రమ్మని పిలుస్తున్నాడు’… తండ్రి చనిపోయిన చోటే కొడుకు ఆత్మహత్య

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.