Telangana

పరీక్ష సరిగ్గా రాయలేదనే బాధలో కానిస్టేబుల్ అభ్యర్థి సూసైడ్..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కొంతమంది యువత చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. చిన్నపాటి విషయాలకే జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. యువత ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి దానికి భయపడి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనవసరంగా ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులకు తీరని కడుపుకోతని మిగులుస్తున్నారు. అలాంటి ఘటన తాజాగా మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని జగదిరిగుట్టలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాడు.

Read Also : పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించిన ఈటల… వారి నిర్ణయం ఇదే..!

సాయికిరణ్ అనే యువకుడు జగదిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. సాయి కిరణ్ అన్న ప్రస్తుతం కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అన్నలాగే కానిస్టేబుల్ అవ్వాలని సాయికిరణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇందుకోసం కానిస్టేబుల్ పరీక్షలకు కొన్నేళ్లు ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. అందులో భాగంగా ఇటీవల కానిస్టేబుల్ పరీక్షలకు కూాడా హాజరయ్యాడు. అయితే పరీక్ష సరిగ్గా రాయలేదని, తనకు ఉద్యోగం రావడం కష్టమని గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో డిప్రెషన్‌కు గురై కానిస్టేబుల్ అవ్వాలన్న కోరిక నెరవేరదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read : టీసీఎస్‌కు బాంబు బెదిరింపు కాల్… బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తి కాల్

తన గదిలో ఉరేసుకుని సాయికిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు సాయికిరణ్ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేసుకొని సాయికిరణ్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఆమనగల్లు స్వాతి హాస్పిటల్ లో విషాదం… ఆపరేషన్ వికటించి యువకుడు మృతి
  2. ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
  3. పొంగులేటి ఇంటికి ఈటల.. తనకు సమాచారం లేదన్న బండి.. బీజేపీలో ఏం జరుగుతోంది?
  4. రీల్స్ కోసం వెర్రి చేష్టలు… గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎండీ సజ్జనార్
  5. నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ తేదీ ఖరారు.. రొమాంటిక్ పోస్టర్‌తో ప్రకటన!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.